Palvai Sravanthi: ఆ రెండు పార్టీలకు మునుగోడు ఉపఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు లేదు

ABN , First Publish Date - 2022-09-13T20:50:43+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.

Palvai Sravanthi:  ఆ రెండు పార్టీలకు మునుగోడు ఉపఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు లేదు

యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నిక(Munugodu by poll)ల్లో  టీఆర్‌ఎస్ (TRS), బీజేపీ (BJP)లకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి (Palvai sravanthi) అన్నారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... మునుగోడు ఎన్నికల్లో తమకు పోటీ టీఆర్ఎస్ పార్టీయే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ (Congress)లో అభిప్రాయ భేదాలు తప్ప వర్గ పోరు లేదని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy) తప్పకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డగా తనను ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. తనకు టికెట్ రావడం పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని స్రవంతి పేర్కొన్నారు. 


Updated Date - 2022-09-13T20:50:43+05:30 IST