Congress leader Priyanka Gandhi: ప్రియాంకాగాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలకు కొవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2022-08-10T15:48:48+05:30 IST

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు(Congress leader Priyanka Gandhi) బుధవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్(tests positive for Covid) అని...

Congress leader Priyanka Gandhi: ప్రియాంకాగాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలకు కొవిడ్ పాజిటివ్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు(Congress leader Priyanka Gandhi) బుధవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్(tests positive for Covid) అని తేలింది. ఈ ఏడాది జూన్ నెలలోనూ ప్రియాంకాగాంధీ కరోనా బారిన పడ్డారు.తనకు రెండోసారి కొవిడ్ పాజిటివ్ రావడంతో ఇంట్లోనే హోంఐసోలేషన్ లో(isolating at home) ఉన్నట్లు బుధవారం ప్రియాంకాగాంధీ ట్వీట్ చేశారు. ప్రియాంకా సోదరుడైన రాహుల్ గాంధీ(Rahul Gandhi) కూడా అనారోగ్యానికి గురవడంతో అతను బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో జరగనున్న నేతృత్వ సంకల్ప శిబిరానికి హాజరు కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(Congress president Sonia Gandhi) జూన్ నెలలో కొవిడ్ బారిన పడ్డారు. 


సోనియా గతంలో కరోనాకు చికిత్స కోసం ఢిల్లీల్లోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్ హెడ్ పవన్ ఖేరా, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనూ సింగ్వీలకు(communications department head Pawan Khera and party MP Abhishek Manu Singhvi) కూడా కరోనా సోకింది. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు( Leader of Opposition in Rajya Sabha and senior Congress leader Mallikarjun Kharge) కూడా మంగళవారం కొవిడ్ సోకింది. తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఖర్గే ట్వీట్ లో కోరారు. 


Updated Date - 2022-08-10T15:48:48+05:30 IST