భవిష్యత్లో బీజేపీ భారీ మూల్యం చెల్లించకోక తప్పదు: Revanth
ABN , First Publish Date - 2021-12-16T16:16:21+05:30 IST
బీజేపీకి బీసీలపై ప్రేమ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: బీజేపీకి బీసీలపై ప్రేమ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ బీసీ కులాల జన గణనను కేంద్రం తిరస్కరించడం సరికాదన్నారు. దేశంలో బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉందని తెలిపారు. బీసీల మనోభావాలను గౌరవించని బీజేపీ... భవిష్యత్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.