పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం బాధాకరం: Sailajanath
ABN , First Publish Date - 2022-04-14T13:46:06+05:30 IST
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం బాధాకరమని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు.
అమరావతి: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం బాధాకరమని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రియాక్టర్ పేలి 6 గురు సజీవదహనం అవ్వడం కలచి వేసిందని తెలిపారు. గాయపడిన 12 మందికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించడం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.