బీజేపీ సర్కార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: Sailajanth

ABN , First Publish Date - 2022-06-14T19:46:52+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే వెనక్కు తీసుకుని... బీజేపీ ప్రభుత్వం బేషరతుగా

బీజేపీ సర్కార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: Sailajanth

అమరావతి: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia gandhi), ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul gandhi)పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే వెనక్కు తీసుకుని... బీజేపీ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని  ఏపీసీసీ అధ్యక్షులు  సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నిందలు మోపుతూ బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఎఫ్‌ఐఆర్ కూడా లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-06-14T19:46:52+05:30 IST