ధరణి బాధితులకు అండగా కాంగ్రెస్: దాసోజు శ్రావణ్

ABN , First Publish Date - 2022-01-23T00:37:42+05:30 IST

రాష్ట్రంలోని ధరణి బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకుడు

ధరణి బాధితులకు అండగా కాంగ్రెస్: దాసోజు శ్రావణ్

హైదరాబాద్: రాష్ట్రంలోని ధరణి బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకుడు దాసోజు శ్రావణ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ ధరణి కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి వల్ల భూ యజమానులు మండల ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నారన్నారు. వారం రోజుల పాటు భూ పరిరక్షణ ఉద్యమం చేస్తామన్నారు. మండల కేంద్రాల్లో ధరణి బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. నివేదక రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని శ్రావణ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-23T00:37:42+05:30 IST