మీటర్లు బిగించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది: Tulasi reddy

ABN , First Publish Date - 2022-05-07T17:06:29+05:30 IST

వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలన్న వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

మీటర్లు బిగించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది: Tulasi reddy

అమరావతి: వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలన్న వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఇది రైతు వ్యతిరేక నిర్ణయమన్నారు. పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరిత్రాళ్లు బిగించడమే అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే అని ఆరోపించారు. ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని అన్నారు. మీటర్లు బిగించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు. 

Read more