-
-
Home » Andhra Pradesh » congress leader tulasi reddy andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
వైసీపీ మేనిఫెస్టోలోని హామీలను విస్మరించింది: Tulasi reddy
ABN , First Publish Date - 2022-05-14T17:27:26+05:30 IST
మేనిఫెస్టోలోని హామీలను వైసీపీ విస్మరించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.
అమరావతి: మేనిఫెస్టోలోని హామీలను వైసీపీ విస్మరించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని మండిపడ్డారు. మూడేళ్లలో మూడు ఇళ్లు కూడా కట్టించలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. మద్యపాన నిషేధం బదులు మద్యపాన నిషా అమలవుతోందని వ్యాఖ్యానించారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి హామీల్లో మాట తప్పారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.