ఏపీలో అరాచక, తాలిబన్ల పాలన: Tulasi reddy

ABN , First Publish Date - 2022-05-24T16:58:18+05:30 IST

రాష్ట్రంలో అరాచక, తాలిబాన్ల పాలన సాగుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీలో అరాచక, తాలిబన్ల పాలన: Tulasi reddy

అమరావతి: రాష్ట్రంలో అరాచక, తాలిబాన్ల పాలన సాగుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదన్నారు. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నా పార్టీ పరంగా ఆయనపై చర్యలు లేవని మండిపడ్డారు. వివేకానంద రెడ్డి హత్యపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ సిబ్బందిని ముసుగు మనిషి బెదిరించడం జరిగిందన్నారు. రాష్ట్రం నేరాంధ్ర ప్రదేశ్‌గా, మధ్యాంద్ర ప్రదేశ్‌గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్‌గా, గంజాయి అంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో నేరాల రేటు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఇప్పటికైనా శాంతి భద్రతల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిందుతుడు ఉదయ భాస్కర్‌ను పార్టీ నుండి బహిష్కరించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-05-24T16:58:18+05:30 IST