వైసీపీ పాలనపై తులసిరెడ్డి ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-27T17:31:09+05:30 IST

వైసీపీ పాలనా తీరుపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనపై తులసిరెడ్డి ఆగ్రహం

అమరావతి: వైసీపీ పాలనా తీరుపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి(Tulasireddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...  అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.13 వేలు ఇచ్చి.. నాన్న బుడ్డి ద్వారా రూ.54 వేలు లాక్కోవడం భావ్యమా? అని ప్రశ్నించారు. సంపూర్ణ మద్య నిషేధం విధిస్తేనే అమ్మ ఒడి పథకం సద్వినియోగం అవుతుందన్నారు. విద్యారంగంలోని పాత పథకాలనే కొత్త పేర్లతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు ఇంగ్లీష్పై అభిమానం.. తెలుగు పట్ల ద్వేషం ఎందుకు అని తులసిరెడ్డి నిలదీశారు. 

Updated Date - 2022-06-27T17:31:09+05:30 IST