అప్పుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్: Tulasireddy
ABN , First Publish Date - 2022-07-15T17:55:37+05:30 IST
ప్రధాని మోదీ (Modi) పాలనలో దేశం పరిస్థితి, జగన్ (Jagan) పాలనలో రాష్ట్ర పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభట్లు అన్నట్లుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి (Tulasireddy) వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ప్రధాని మోదీ (Modi) పాలనలో దేశం పరిస్థితి, జగన్ (Jagan) పాలనలో రాష్ట్ర పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభట్లు అన్నట్లుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి (Tulasireddy) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పతనమైందన్నారు. అప్పుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్కు శ్రీలంక పరిస్థితి వస్తుందని అన్నారు. రాజపక్సే దుస్థితి రాకుండా మోదీ, జగన్ జాగ్రత్త పడడం మంచిది అంటూ తులసిరెడ్డి హితవుపలికారు.