ఎన్నికలకు ముందు వాగ్ధానాలను వైసీపీ విస్మరించింది: Tulasireddy

ABN , First Publish Date - 2022-01-07T18:30:42+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను విస్మరించిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు.

ఎన్నికలకు ముందు వాగ్ధానాలను వైసీపీ విస్మరించింది: Tulasireddy

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను విస్మరించిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై పెట్రోల్ ధరలతో అధికభారం మోపారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో డీజల్, పెట్రోల్ ధరలను పోల్చి చూస్తే ఏపీలోనే అధికమన్నారు. రాష్ట్రంలో గతంలో కరెంటు పట్టుకుంటే షాక్ కొట్టేదని... ఇప్పుడు కరెంటు బిల్లు తగిలితే షాక్ కొడుతోందని వ్యాఖ్యానించారు. ఇసుక సిమెంట్ ధరలను పెంచి రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం కుదేలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు చేసినందుకు సీఎం జగన్ రాజీనామా చెయాలని డిమాండ్ చేశారు. పంజాబ్‌లో నిన్న రైతులు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తే.. దేశ ప్రధాని తనకు ప్రాణ భయం ఉంది అనడం చాలా సోచనీయమని తులసిరెడ్డి అన్నారు. 

Updated Date - 2022-01-07T18:30:42+05:30 IST