ఉద్యోగులు, నిరుద్యోగులను నిరాశపరచిన వైసీపీ: Tulasi reddy

ABN , First Publish Date - 2022-01-08T17:46:40+05:30 IST

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు.

ఉద్యోగులు, నిరుద్యోగులను నిరాశపరచిన  వైసీపీ: Tulasi reddy

అమరావతి: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం అటు ఉద్యోగులను, ఇటు నిరుద్యోగులను ఇద్దరినీ నిరాశ పరిచిందన్నారు. పదవీ విరమణ వయస్సును 60నుంచి 62 ఏళ్లకు పెంచడం ద్వారా నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో.... అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంలోనూ చేతులెత్తేసినట్లు తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. 


Updated Date - 2022-01-08T17:46:40+05:30 IST