ప్రత్యేక హోదా ఏపీ సంజీవినీ: Tulasi reddy

ABN , First Publish Date - 2022-02-15T16:21:40+05:30 IST

ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు.

ప్రత్యేక హోదా ఏపీ సంజీవినీ: Tulasi reddy

అమరావతి: ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవినీ అని, హోదా కాంగ్రెస్ పేటెంట్ అని తెలిపారు. ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. హోదా అంశం ముగిసిన అధ్యాయం అని చెప్పి బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, జగన్ పార్టీ, జనసేన పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు... తెచ్చే శక్తి లేదన్నారు. ప్రాంతీయ పార్టీలవి ఉడత ఊపులు మాత్రమే అని వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీల ది పెండ్లింటి కాడ కుక్కల గోల లాంటిదని విమర్శించారు. ప్రాంతీయ పార్టీల ఉచ్చులో, మాయలో, గోలలో పడవద్దన్నారు. 2024 లో కాంగ్రెస్‌ను గెలిపించాలని... ప్రత్యేక హోదా పొందాలని కోరారు. ప్రధానిగా రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పైనే అని స్పష్టం చేశారు. మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని తులసిరెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-15T16:21:40+05:30 IST