ఇది కూతల, కోతల, పిట్టల దొర బడ్జెట్: Tulasi reddy
ABN , First Publish Date - 2022-03-12T16:21:37+05:30 IST
వైసీపీ పాలనలో వార్షిక బడ్జెట్లకు విలువ, విశ్వసనీయత లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.
అమరావతి: వైసీపీ పాలనలో వార్షిక బడ్జెట్లకు విలువ, విశ్వసనీయత లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ... చెప్పే దానికి, చేసేదానికి పొంతన ఉండదన్నారు. ఇది కూతల, కోతల, పిట్టల దొర బడ్జెట్ అని వ్యాఖ్యలు చేశారు. ఇది త్రాగుబోతుల బడ్జెట్ అని... ఇది అప్పుల బడ్జెట్ అని తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు.