పేరుకు విద్యా దీవెన, అమలులో విద్యా శాపం: Tulasi reddy

ABN , First Publish Date - 2022-03-16T18:19:47+05:30 IST

వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా దీవెన పథకంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విరుచుకుపడ్డారు.

పేరుకు విద్యా దీవెన, అమలులో విద్యా శాపం: Tulasi reddy

అమరావతి: వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా దీవెన పథకంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విరుచుకుపడ్డారు. పేరుకు విద్యా దీవెన, అమలులో విద్యా శాపం అని అన్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలను ప్రవేశపెట్టిందని... జగన్ ప్రభుత్వం పేర్లు మార్చిందన్నారు. 25-12-2020న వైసీపీ ప్రభుత్వం  జీవో 77 జారీ చేసిందన్నారు. దీని ప్రకారం ప్రైవేట్ పీజీ కళాశాలల్లో పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి ధీవెన వర్తించవని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి పేదల ఉన్నత విద్య పట్ల చిత్తశుద్ధి ఉంటే జీఓ 77ను రద్దు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-16T18:19:47+05:30 IST