వైసీపీ ఓటమిని ఎవ్వరూ ఆపలేరు: Tulasi reddy

ABN , First Publish Date - 2022-07-09T17:49:31+05:30 IST

మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95 శాతం అమలు చేశామని వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్ చెప్పడం పచ్చి అపద్ధమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

వైసీపీ ఓటమిని ఎవ్వరూ ఆపలేరు: Tulasi reddy

అమరావతి: మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95 శాతం అమలు చేశామని వైసీపీ ప్లీనరీ(YCP plenary)లో  ముఖ్యమంత్రి జగన్(Jagan) చెప్పడం పచ్చి అపద్ధమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి(Tulasireddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత’’ అన్నట్లున్నాయ్ జగన్ వ్యాఖ్యలు అని మండిపడ్డారు. వాస్తవంగా 95 శాతం అమలు చేయలేదని... రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. వైసీపీ ప్లీనరీ సభను జగన్ భజన సభ, విజయమ్మ వీడ్కోలు సభ, వైసీపీ చివరి ప్లీనరీ సభగా చెప్పవచ్చన్నారు. తల్లిని అవమానపరిచిన తనయుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి అగౌరవంగా తొలగించారని తెలిపారు. ఇప్పటికైనా జగన్ భజన బృందానికి కనువిప్పు కలగాలని తులసిరెడ్డి హితవుపలికారు. 

Updated Date - 2022-07-09T17:49:31+05:30 IST