ప్రశాంతంగా పని చేసుకోనివ్వలేదన్న బాధ రోశయ్యకుండేది: VH

ABN , First Publish Date - 2021-12-04T17:51:36+05:30 IST

ప్రశాంతంగా ముఖ్యమంత్రి పదవి చేయకుండా రోశయ్యను హింసించారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు.

ప్రశాంతంగా పని చేసుకోనివ్వలేదన్న బాధ రోశయ్యకుండేది: VH

హైదరాబాద్: ప్రశాంతంగా ముఖ్యమంత్రి పదవి చేయకుండా రోశయ్యను హింసించారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. రోశయ్యను అందరూ ఉపయోగించుకున్నారని వ్యాఖ్యానించారు. తనకు ప్రశాంతంగా పనిచేసుకునివ్వలేదన్న బాధ రోశయ్యకుండేదని తెలిపారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. రోశయ్య నిజమైన కాంగ్రెస్ వాది అని చెప్పుకొచ్చారు. ఆయన కుంటుంబానికి వీహెచ్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2021-12-04T17:51:36+05:30 IST