V.Hanumanth rao: మేము ఎక్కడికీ పోము, సచ్చే వరకు కాంగ్రెస్‌లో ఉంటాం

ABN , First Publish Date - 2022-08-20T19:13:09+05:30 IST

కాంగ్రెస్ నేతల మధ్య మనస్పర్థలు ఉంటే సరి చేయాలని... ఢిల్లీ పెద్దలు నేతల సమస్యలు తెలుసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.

V.Hanumanth rao: మేము ఎక్కడికీ పోము, సచ్చే వరకు కాంగ్రెస్‌లో ఉంటాం

హైదరాబాద్: కాంగ్రెస్ నేతల (Congress leaders) మధ్య మనస్పర్థలు ఉంటే సరి చేయాలని... ఢిల్లీ పెద్దలు నేతల సమస్యలు తెలుసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (V Hanumanth rao) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అందరినీ పార్టీ నుంచి పంపించే ఆలోచన మంచిది కాదని తెలిపారు. ఎవరైనా సమస్యలు చెబితే.. వారు పార్టీ మారుతారని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారన్నారు. ‘‘మేము ఎక్కడికి పోము, సచ్చే వరకు కాంగ్రెస్‌లో ఉంటాం’’ అని స్పష్టం చేశారు. నేతలు అంతా కలిసి ఉంటే మునుగోడులో గెలువడం ఖాయమన్నారు. రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) బీజేపీలోకి ఎందుకు వెళుతున్నారో తెలీదన్నారు. పాలపై కూడా జీఎస్టీ వేసిన బీజేపీకి ఓట్లు వేస్తారా? అని వి.హనుమంతరావు ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-20T19:13:09+05:30 IST