రాష్ట్రంలో పోలీసులే రౌడీలుగా మారుతున్నారు: వీహెచ్

ABN , First Publish Date - 2022-04-21T21:01:24+05:30 IST

లంగాణ రాష్ట్రంలో పోలీసులే రౌడీలుగా మారుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఆరోపించారు.

రాష్ట్రంలో పోలీసులే రౌడీలుగా మారుతున్నారు: వీహెచ్

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో పోలీసులే రౌడీలుగా మారుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఆరోపించారు. మంత్రి పువ్వాడ చిన్న కార్యకర్తలపై కూడా కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. కేసీఆర్.. మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని వీహెచ్ సూచించారు.లేకపోతే మేము అదుపుతప్పుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షసాధింపు రాజకీయాలు మంచిది కాదని అన్నారు.టీఆర్ఎస్ గద్దె దించాలంటే కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న రౌడీ రాజకీయాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. 


Updated Date - 2022-04-21T21:01:24+05:30 IST