HYD: ప్రధాని మోదీకి వీహెచ్ లేఖ

ABN , First Publish Date - 2021-07-30T19:29:32+05:30 IST

ఓబీసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని ప్రధానమంత్రికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ లేఖ రాశారు.

HYD: ప్రధాని మోదీకి వీహెచ్ లేఖ

హైదరాబాద్: ఓబీసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని ప్రధానమంత్రికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ లేఖ రాశారు. బీసీ ప్రధాన మంత్రి గా చెప్పుకునే నరేంద్రమోదీకి చిత్తశుద్ధి ఉంటే ఓబీసీ ల క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తేయాలన్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేరుకు 27% కేటాయించిన ఇప్పటి వరకు బీసీలకు 9 నుంచి 10 శాతం కూడా అమలుకు నోచుకోవడం లేదన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని తొలగించకుంటే వందేళ్లు అయినా  బీసీలకు న్యాయం జరగదని తెలిపారు. పి.వి.నరసింహారావు పీఎంగా ఉన్నప్పుడు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్‌ను ఇప్పటికీ పెంచలేదన్నారు. మోదీ తన మంత్రి వర్గంలో 27 మంది బీసీ మంత్రులను క్రిమిలేయర్ చూసి పదవులు కట్టబెట్టరా అని వీహెచ్ ప్రశ్నించారు. 


Updated Date - 2021-07-30T19:29:32+05:30 IST