రేవంత్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
ABN , First Publish Date - 2022-05-16T05:14:58+05:30 IST
రేవంత్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
ఆమనగల్లు, మే 15: టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్రెడ్డిని ఆదివారం ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో ఓ ఫంక్షన్హాల్లో రేవంత్రెడ్డిని కలిసి పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ఈ సందర్భంగా రేవంత్రెడ్డి వారికి సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు నాయకులు తెలిపారు. రేవంత్రెడ్డిని కలిసిన వారిలో టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్సగౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్సరెడ్డి, పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీక్యానాయక్, మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివా్సరెడ్డి, రేవంత్మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు అసీ్ఫఅలీ, ఉపాధ్యక్షుడు లింగంపల్లి ఆనంద్, పీఏసీఎస్ డైరెక్టర్ చేగూరి వెంకటేశ్, కాంగ్రెస్ నాయకులు గురిగళ్ల లక్ష్మయ్య, బీచ్యానాయక్, సత్యం, జవహార్నాయక్, హీరాసింగ్, ఇమ్రాన్బాబా, రాజేశ్, విజయ్, చంద్రశేఖర్, కృష్ణనాయక్, శంకర్, పురుషోత్తంరెడ్డి, మోహన్రెడ్డి, యాదయ్య, బాల్రాజ్, రామకృష్ణ, తదితరులు ఉన్నారు.