TS News: కరీంనగర్ జిల్లా జైలు సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు...అనుమతి లేదన్న పోలీసులు

ABN , First Publish Date - 2022-08-29T16:42:39+05:30 IST

కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ సోమవరాం ఉదయం జిల్లా జైలు సందర్శనకు వెళ్లారు.

TS News: కరీంనగర్ జిల్లా జైలు సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు...అనుమతి లేదన్న పోలీసులు

కరీంనగర్: కాంగ్రెస్ నేతలు (Congress leaders) పొన్నం ప్రభాకర్ (Ponnam prabhakar), మేడిపల్లి సత్యం (Medipalli satyam), కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampalli satyanarana) సోమవరాం ఉదయం జిల్లా జైలు సందర్శనకు వెళ్లారు. ఇటీవల సీఎం కేసీఆర్ (CM kcr) కోసం జైలులో గదిని సిద్ధం చేశానంటూ బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైలులో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దామంటూ పొన్నం, కాంగ్రెస్‌ నేతలు వెళ్లారు. అయితే లోపలికి అనుమతి లేదంటూ కాంగ్రెస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బండి సంజయ్ అబద్దాలు చెప్తున్నారని పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-29T16:42:39+05:30 IST