Mallu Ravi: సుమతమ్మ కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోరా?.
ABN , First Publish Date - 2022-08-31T22:59:17+05:30 IST
ఇతర రాష్ట్రాల ఆర్మీ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ఆర్మీ జవాన్ల కుటుంబాలను..
హైదరాబాద్ (Hyderabad): ఇతర రాష్ట్రాల ఆర్మీ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్న సీఎం కేసీఆర్ (Cm Kcr) .. తెలంగాణ ఆర్మీ జవాన్ల కుటుంబాలను (Telangana Army Jawan Families) ఎందుకు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి (Congress Senior Leader Mallu Ravi) ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇవాళ బీహార్ (Bihar) వెళ్లి.. అక్కడి అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఈ పర్యటనపై మల్లు రవి స్పందించారు.
తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుమతమ్మ భర్త యాదయ్య ఆర్మీ ఆఫీసర్ అని.. 9 ఏళ్ళ క్రితం డ్యూటీలో చనిపోయారని.. 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఇంతవరకు భూమి, ఉద్యోగం ఇవ్వలేదని మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సాయం అందకపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని చెప్పారు. పిల్లల చదువు భారంగా మారిందని సుమతమ్మ ఆందోళన వ్యక్తం చేస్తుందని తెలిపారు. సుమతమ్మ కుటుంబానికి ప్రభుత్వ సహాయం చేయకుంటే కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తామన్నారు. అలాగే మిలటరీలో చనిపోయి ప్రభుత్వ సహాయం అందని వారి వివరాలు సేకరిస్తున్నామని మల్లు రవి పేర్కొన్నారు.