komatireddy rajagopalreddy: వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్
ABN , First Publish Date - 2022-07-27T18:07:48+05:30 IST
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉంది.
హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy rajagopal reddy) వ్యవహారంపై కాంగ్రెస్(Congress) హైకమాండ్ సీరియస్గా ఉంది. రాజగోపాల్ రెడ్డిపై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటకే చర్యలు తీసుకోవాలని నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్న నేపథ్యంలో మునుగోడుపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అభ్యర్థి కోసం మంతనాలు చేపట్టింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి, పల్లె రవి, నల్గొండ ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల, వివేక్ లతో రాజగోపాల్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. రెండు మూడు రోజుల్లో మరోసారి నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయనుండటంతో మునుగోడు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది.