Seethakka: మూడేళ్ల నుంచి కనిపించని నేతలు రాళ్లు వేస్తున్నారు.. సీనియర్లపై సీతక్క వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-19T20:43:02+05:30 IST

కాంగ్రెస్ సీనియర్లపై ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.

Seethakka: మూడేళ్ల నుంచి కనిపించని నేతలు రాళ్లు వేస్తున్నారు.. సీనియర్లపై సీతక్క వ్యాఖ్యలు

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ల (Congress seniors )పై ఎమ్మెల్యే సీతక్క (Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..  కాంగ్రెస్‌ (Congress)లో కొందరు నేతలు పని చేస్తూ మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. మూడేళ్ల నుంచి ఎక్కడ కనిపించని నేతలు రాళ్లు వేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy) షీల్డ్ కవర్ పీసీసీ ప్రెసిడెంట్ (PCC President) కాదని... మెజారిటీ అభిప్రాయం మేరకు పీసీసీ అయ్యారని చెప్పుకొచ్చారు. పీసీసీ మీద రాళ్ళు వేస్తే పార్టీకి నష్టమన్నారు. సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడాలని ఎమ్మెల్యే సూచించారు.


రేపటి పాదయాత్రలో వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) పాల్గొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆహ్వానాలు పంపడానికి ఇది ఎవరి ఇంట్లో పెళ్లి కాదని.. అందరికీ గాంధీ భవన్ (Gandhi bhavan)నుంచి ఫోన్లు వస్తున్నాయన్నారు. తమకు కూడా గాంధీ భవన్ నుంచే ఫోన్లు వచ్చాయని... వెళ్లి పని చేస్తున్నామని అన్నారు. సొంత తమ్ముడు కావడం వల్ల వెంకట్ రెడ్డికి కొంత ఇబ్బంది ఉండొచ్చన్నారు. మునుగోడులో తాము ఇంటింటికీ వెళ్లి విజ్ఞప్తి చేస్తామని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు.

Updated Date - 2022-08-19T20:43:02+05:30 IST