శనగకుంటలో సీతక్క పర్యటన... అగ్నిప్రమాద బాధితులకు ఓదార్పు

ABN , First Publish Date - 2022-04-29T13:51:20+05:30 IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం ఉదయం జిల్లాలోని మంగపేట మండలం శనగకుంటలో పర్యటించారు.

శనగకుంటలో సీతక్క పర్యటన... అగ్నిప్రమాద బాధితులకు ఓదార్పు

ములుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం ఉదయం జిల్లాలోని  మంగపేట మండలం శనగకుంటలో పర్యటించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాద బాధితులను ఎమ్మెల్యే ఓదార్చారు. బాధితులకు తక్షణసాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాద బాధితులకు గిన్నెలు, దుప్పట్లు, నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు. 


కాగా... మంగపేట మండలం శనగకుంటలో గత రాత్రి జరిగిన అగ్నిప్రమాదానికి ఊరు మొత్తం కాలిబూడిదైన విషయం తెలిసిందే. దాదాపు 40 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఆదివాసి గూడెం వాసులు చెల్లాచెదురయ్యారు. పిల్లాపాపలతో పక్కూరిలో తలదాచుకున్నారు. నిలువనీడ లేకపోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డునపడ్డాయి. 

Updated Date - 2022-04-29T13:51:20+05:30 IST