Goa: కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ షాక్

ABN , First Publish Date - 2022-09-14T17:29:17+05:30 IST

గోవా(Goa) కాంగ్రెస్ పార్టీలో కలకలం ఏర్పడింది....

Goa: కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ షాక్

కమలం పార్టీలోకి 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

పనాజీ (గోవా): గోవా(Goa) కాంగ్రెస్ పార్టీలో కలకలం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం దిగంబర్ కామత్(former CM Digambar Kamat), ప్రతిపక్ష నేత మైఖైల్ లోబోలతో( leader of the opposition Michael Lobo) కలిసి మొత్తం 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs) బుధవారం బీజేపీ తీర్థం స్వీకరించనున్నారు.(join BJ) దిగంబర్ కామత్, మైఖైల్ లోబో, దేలిలాహ్ లోబో, రాజేష్ ఫలదేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోనకర్, అలెక్సో సీక్వెరియా, రుడాల్ఫ్ ఫెర్నాండేజ్ లు(Eight Congress MLAs) బుధవారం గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను కలిశారు. కాంగ్రెస్ నేతల ఫిరాయింపుల పర్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ గతంలో ‘‘కోకిల గొంతు గొణుగుతోంది, కోకిల పక్షి తప్పు చేసింది’’ అంటూ ట్వీట్ చేశారు.



 గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి ముగ్గురే మిగులుతారని గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద చెప్పారు. మొత్తం మీద 8మంది గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ చేరుతుండటం సంచలనం రేపింది. భారత్ జోడో యాత్ర సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కమలదళంలో చేరుతుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

Updated Date - 2022-09-14T17:29:17+05:30 IST