ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2020-10-23T16:04:33+05:30 IST

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఛలో జగిత్యాలకు వెళ్తారని ముందస్తుగా పోలీసులు మోహరించారు.

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గృహ నిర్బంధం

జగిత్యాల: ఛలో జగిత్యాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన నివాసం ముందు భారీగా పోలీసుల మోహరించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... మోదీ, కేసీఆర్‌లవి తప్పుడు ఆలోచనలన్నారు. వ్యాపారులకు లాభం చేకూర్చడమే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రైతులను కేసీఆర్ నట్టేటా ముంచారని మండిపడ్డారు. కడుపు కాలి రైతులు రోడ్డెక్కుతున్నారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నిస్తూ కేసీఆర్ కంటే రాజుల కాలం నయమని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-10-23T16:04:33+05:30 IST