Jeevanreddy: ‘రాజగోపాల్‌రెడ్డికి అసెంబ్లీతో బంధం తెగిపోయింది’

ABN , First Publish Date - 2022-08-08T17:37:00+05:30 IST

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అసెంబ్లీతో బంధం తెగిపోయిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Jeevanreddy: ‘రాజగోపాల్‌రెడ్డికి అసెంబ్లీతో బంధం తెగిపోయింది’

హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatrireddy rajagopalreddy)కి అసెంబ్లీ (Assembly)తో బంధం తెగిపోయిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan reddy)అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ (TRS) మునిగిపోయే పడవ అని వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసమే రాజీనామా చేశాననడం చేతగాని తనమే అని మండిపడ్డారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్‌రెడ్డి (Rajagopalreddy) ఉపయోగించుకోలేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఫైట్ చేస్తానంటే కాంగ్రెస్ (Congress) అడ్డుపడిందా అని ప్రశ్నించారు. అధ్యక్షుడు అయితేనే పోరాడుతా అనడం సరికాదని జీవన్‌రెడ్డి అన్నారు. 

Updated Date - 2022-08-08T17:37:00+05:30 IST