జెడ్పీ సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం దారుణం: Jeevan reddy

ABN , First Publish Date - 2022-07-06T19:21:42+05:30 IST

జెడ్పీ సమావేశానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా గైర్హాజరవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

జెడ్పీ సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం దారుణం: Jeevan reddy

మంచిర్యాల:  జెడ్పీ సమావేశానికి టీఆర్ఎస్ (TRS) ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా గైర్హాజరవడంపై కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సదర్భంగా ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ... జెడ్పీ సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం దారుణమన్నారు.  ప్రజలకు సంబంధించిన సమావేశానికి రాజకీయ కారణాలతో గైర్హాజరవడం తప్పని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదు కానీ కేసులు మాత్రం పెట్టిస్తున్నారని మండిపడ్డారు. సరిపడా సిబ్బందిని పాఠశాలల్లో నియమించకుంటే మన ఊరు.. మన బడి సక్సెస్ కాదన్నారు. ఉపాధ్యాయులు అవసరం ఉన్న చోట వెంటనే విద్యావలంటీర్లను నియమించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-07-06T19:21:42+05:30 IST