‘జన సంసద్’ ర్యాలీలో నాపై దాడి చేశారు : కాంగ్రెస్ ఎంపీ రన్‌వీత్

ABN , First Publish Date - 2021-01-25T15:59:19+05:30 IST

సింగూ సరిహద్దులో జరిగిన ‘జన సంసద్’ ర్యాలీలో తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రన్‌వీత్ సింగు బిట్టూ ఆరోపించారు

‘జన సంసద్’ ర్యాలీలో నాపై దాడి చేశారు : కాంగ్రెస్ ఎంపీ రన్‌వీత్

న్యూఢిల్లీ : సింగూ సరిహద్దులో జరిగిన ‘జన సంసద్’ ర్యాలీలో తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రన్‌వీత్ సింగ్ బిట్టూ ఆరోపించారు. గుర్తు తెలియని వ్యక్తులు తనను తోసేశారని, అంతేకాకుండా తలపాగాను కూడా లాగేశారని ఆయన ఆరోపించారు. కొందరి సహాయంతో వాహనంలోకి ఎక్కినా.... దుండగులు కర్రలతో వాహనంపై దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. ‘‘కర్రలు, ఆయుధాలతో సాయుధ వ్యక్తుల బృందం నాపై మెరుపు దాడికి దిగింది. ఈ దాడి ఓ పద్ధతి ప్రకారం జరిగింది. అయితే రైతుల నిరసన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని తొందరగానే నిష్క్రమించాను.’’ అని  రన్‌వీత్ సింగ్ బిట్టూ పేర్కొన్నారు.


 


Updated Date - 2021-01-25T15:59:19+05:30 IST