MP Uttamkumar: రాజగోపాల్ బీజేపీలో చేరడం దుర్మార్గమైన చర్య

ABN , First Publish Date - 2022-09-03T19:21:14+05:30 IST

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేశారని.. ఆయన బీజేపీలో చేరడం దుర్మార్గమైన చర్య అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Uttamkumar: రాజగోపాల్ బీజేపీలో చేరడం దుర్మార్గమైన చర్య

నల్గొండ: రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) కాంగ్రెస్(Congress) పార్టీకి తీరని ద్రోహం చేశారని.. ఆయన బీజేపీ (BJP)లో చేరడం దుర్మార్గమైన చర్య అని  ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం (BJP Government) తెలంగాణ (Telangana)కు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మునుగోడు (Munugodu by poll) గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పాలనపై విడుదల చేసిన ఛార్జ్ షీట్‌ను కాంగ్రెస్ సైన్యం మునుగోడు నియోజకవర్గంలో గడప గడపకూ తీసుకెళ్లాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Congress mp) కోరారు. 

Updated Date - 2022-09-03T19:21:14+05:30 IST