అగ్నిపథ్ రద్దు చేయాలని కాంగ్రెస్ సత్యాగ్రహం
ABN , First Publish Date - 2022-06-29T06:46:10+05:30 IST
సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం పెడనలో సత్యాగ్రహం చేశారు.
పెడన : సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం పెడనలో సత్యాగ్రహం చేశారు. అగ్నిపథ్ పథకం దేశ భద్రతకు, దేశ భవిష్యత్కు విఘా తం కలిగిస్తుందన్నారు. సత్యాగ్రహంలో కాంగ్రెస్ నాయకులు సి.హెచ్.వి.అప్పారావు, ఆకురాతి జనార్దన్, కె.వి.నాగభూషణం, రాగి రమేష్, జన్యావుల లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.