నవభారత నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ కృషి

ABN , First Publish Date - 2022-08-09T05:30:00+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చి నవ భారత్‌ నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ ఎనలేని కృషి చేసిందని రామగుండం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు.

నవభారత నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ కృషి
గోదావరిఖనిలో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహిస్తున్న మక్కాన్‌సింగ్‌

-రామగుండం నియోజకవర్గ  కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మక్కాన్‌సింగ్‌ 

గోదావరిఖని, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చి నవ భారత్‌ నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ ఎనలేని కృషి చేసిందని రామగుండం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆజాద్‌ కా అమృత్‌ పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ పాదయాత్ర గోదావరిఖని గాంధీనగర్‌లోని గాంధీ విగ్రహం నుంచి చౌరస్తాలో, శివాజీనగర్‌, కళ్యాణ్‌నగర్‌ గుండా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన వారి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆ నాటి స్వాతంత్య్రం సంగ్రామ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించడం కోసమే ఆజాద్‌ కా గౌరవ్‌ పాదయాత్రను చేపట్టినట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి కాల్వ లింగస్వామి,  కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, గాదం విజయనందు, నాయకురాలు మృణాలి ఠాకూర్‌, నాయకులు పెద్దెల్లి ప్రకాష్‌, నాయిని ఓదెలు, వీరబోయిన రవికుమార్‌, మారెల్లి రాజిరెడ్డి, తౌటం సతీష్‌, తాళ్లపల్లి యుగేంధర్‌, దూళికట్ట సతీష్‌, నాజీమోద్దీన్‌, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-09T05:30:00+05:30 IST