AP News: తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర
ABN , First Publish Date - 2022-08-13T17:24:41+05:30 IST
తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది.
తిరుపతి: తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ (Congress) పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. కేంద్ర మాజీ మంత్రులు టీ.సుబ్బిరామిరెడ్డి (T subbiramireddy), చింతా మోహన్ (Chinta mohan)పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.... టీటీడీ (TTD) పరిపాలను ప్రస్తుతం చాలా బాగుందన్నారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి (YV Subbareddy), ఈఓ ధర్మారెడ్డి (Dharma reddy) నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. అన్యాయానికి అవకాశం లేకుండా భక్తులకు సేవ చేస్తున్నారన్నారు. ఎంత మంచి పాలన ఉన్నా దానిపై రాళ్లు వేయడం మామూలే అన్నారు. రెండుసార్లు టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తిగా టీటీడీ పాలనను ప్రశంసిస్తున్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు.