Padayatra: వాడవాడలా కాంగ్రెస్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-08-11T13:33:58+05:30 IST

తమిళనాడు కాంగ్రెస్‌ కమిటి (టీఎన్‌సీసీ) ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని వాడవాడలా కాంగ్రెస్‌ శ్రేణులు

Padayatra: వాడవాడలా కాంగ్రెస్‌ పాదయాత్ర

ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 10: తమిళనాడు కాంగ్రెస్‌ కమిటి (టీఎన్‌సీసీ) ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని వాడవాడలా కాంగ్రెస్‌ శ్రేణులు పాదయాత్ర(Padayatra) చేపడుతున్నారు. తెన్‌కాశి జిల్లా కుట్రాలంలో మంగళవారం 75 కి.మీ పాదయాత్రను టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(KS Alagiri) ప్రారంభించారు. ఈ క్రమంలో పరిశ్రమల నగరం కోయంబత్తూర్‌(Coimbatore)లో బుధవారం ఉదయం చేపట్టిన పాదయాత్రలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 14వ తేది వరకు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 75 కి.మీల పాదయాత్ర నిర్వహించాల్సిందిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపునిచ్చింది. దక్షిణ చెన్నై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మైలాపూర్‌లో కేంద్ర మాజీ మంత్రి కేవీ తంగబాలు(KV Thangabalu) నేతృత్వంలో జరిగిన ర్యాలీలో కౌన్సిలర్‌ సుభాషిణి దురై, ఏఐసీసీ సభ్యులు అడయార్‌ భాస్కర్‌, రవీంద్రదాస్‌, కార్యవర్గ సభ్యురాలు సుమతి అన్బురసు, మైలై అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, సెంట్రల్‌ చెన్నై జిల్లా అధ్యక్షుడు శివరాజశేఖరన్‌ నేతృత్వంలో థౌజండ్‌ లైట్స్‌, హార్బర్‌, చేపాక్కం, ట్రిప్లికేన్‌ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు.

Updated Date - 2022-08-11T13:33:58+05:30 IST