AP News: కాంగ్రెస్ అవినీతికి పాల్పడి ఉంటే.. దేశంలో ఏదీ మిగిలేది కాదు: పొన్నం
ABN , First Publish Date - 2022-07-30T01:19:30+05:30 IST
దేశాన్ని ఎక్కువకాలం పరిపాలించిన కాంగ్రెస్ (Congress) అవినీతికి పాల్పడి ఉంటే దేశంలో ఏదీ మిగిలేది కాదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్
తిరుమల: దేశాన్ని ఎక్కువకాలం పరిపాలించిన కాంగ్రెస్ (Congress) అవినీతికి పాల్పడి ఉంటే దేశంలో ఏదీ మిగిలేది కాదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని శుక్రవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. దేశంలో కక్షసాధింపు రాజకీయాలు లేకుండా చూడాలని శ్రీవారిని కోరుకున్నట్టు తెలిపారు. సోనియాగాంధీ (Sonia Gandhi) కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే ఈడీ పేరుతో రోజుల తరబడి విచారణ చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడా ఒక్క రూపాయి కూడా నగదు లావాదేవీలు జరక్కపోయినప్పటికీ కక్షసాధింపుతో వేధిస్తున్నారని దుయ్యబట్టారు. సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పాలు, పెరుగు, డీజల్, పెట్రోల్, గ్యాస్లపై జీఎస్టీ పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రజలు గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అందరూ బతకాలని కోరుకునేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అదాని, అంబాని బతకడానికే పనిచేస్తోందని పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు.