Sonia Gandhi త్వరగా కోలుకోవాలి: Modi

ABN , First Publish Date - 2022-06-02T22:31:12+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Sonia Gandhi త్వరగా కోలుకోవాలి: Modi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 






అంతకు ముందు సోనియాకు కోవిడ్ సోకిందని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఆమెకు తేలికపాటి జ్వరం వచ్చిందని, ప్రస్తుతం ఆమె సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా తెలియజేశారు. వైద్యుల సలహామేరకు ఆమె సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారని తెలిపారు.




వాస్తవానికి ఈ నెల 8న ఆమె నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. సోనియాకు, ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ నిన్ననే నోటీసులు జారీ చేసింది. రాహుల్ ఈ నెల 2న, సోనియా ఈ నెల 8న తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ సమన్లు పంపింది. అయితే రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని ఈ నెల 5న హాజరయ్యేందుకు అనుమతినివ్వాలని కాంగ్రెస్ పార్టీ ఈడీని కోరింది. 


కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు. 

Updated Date - 2022-06-02T22:31:12+05:30 IST