కేసీఆర్... తాగుబోతుల తెలంగాణగా మార్చారు: VH
ABN , First Publish Date - 2022-05-13T18:07:35+05:30 IST
రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలతో నేరాలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలతో నేరాలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(V.Hanumanth rao) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజలను తాగుబోతులను చేసి.. సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. పర్మిట్ రూమ్లంటూ బార్ షాపుల తయారు చేశారన్నారు. ఈ ప్రభుత్వంపై తిరగబడేందుకు మహిళలు రోడ్డు మీదకు రావాలని పిలుపునిచ్చారు. ఒకే బస్తీలో మూడు, నాలుగు బార్, వైన్ షాపులు తెరిచారన్నారు. ప్రభుత్వం విస్కీ, వైన్ అమ్మకాలతోనే నడుస్తోందని విమర్శించారు. కేసీఆర్(KCR)...తాగుబోతుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, రేవంత్తో ఆలోచన చేసి.. మధ్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహిళల తరుపున తాను పోరాటం చేస్తానని అన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని విహెచ్ హితవు పలికారు.