దామోదరం సంజీవయ్యను మనం గౌరవించుకోవాలి: VH
ABN , First Publish Date - 2021-10-18T18:04:35+05:30 IST
దివంగత నేత దామోదరం సంజీవయ్య జయంతి, వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: దివంగత నేత దామోదరం సంజీవయ్య జయంతి, వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు తప్పకుండా పాల్గొనాలన్నారు. దామోదరం సంజీవయ్య అత్యంత నిజాయితీ పరుడన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారని తెలిపారు. ఆయనను అందరం గౌరవించుకోవాలని అన్నారు. కర్నూల్లో ఆయన ఇంటిని అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు ఇవ్వడాన్ని హర్షిస్తున్నానన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటుపరం కాకుండా ఉండాలంటే జగన్ ఎన్డీయేలో కలవాలని కేంద్ర మంత్రి రాం దాస్ అతవలె అనడం శోచనీయమని అన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏదో గూడపుటని జరుగుతుందన్నారు. ప్రైవేట్పరం అయితే రిజర్వేషన్లు పోతాయని...ఈ విషయంలో తాను పోరాటం చేస్తానని వీహెచ్ స్పష్టం చేశారు.