అర్థాంతరంగా ముగిసిన కాంగ్రెస్ సీనియర్ల భేటీ

ABN , First Publish Date - 2022-03-20T22:15:07+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ల భేటీ అర్థాంతరంగా ముగిసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సీనియర్లు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

అర్థాంతరంగా ముగిసిన కాంగ్రెస్ సీనియర్ల భేటీ

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ల భేటీ అర్థాంతరంగా ముగిసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సీనియర్లు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు అనుకున్నట్లే ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు వీహెచ్‌, మర్రి శశిధర్‌రెడ్డి, జగ్గారెడ్డి, కమలాకర్‌రావు, శ్యామ్‌మోహన్ పాల్గొన్నారు. సీనియర్ సమావేశం అవుతున్నారని ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు వెళ్లింది. దీంతో హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు సీనియర్ నేతలకు ఫోన్ చేశారు. ఏమైనా సమస్య ఉంటే నేరుగా సోనియా, రాహుల్‌ గాంధీలకు చెప్పాలని సూచించారు. దీంతో భేటీకి మెజారిటీ సీనియర్ల డుమ్మా కొట్టారు. ఎవరూ హాజరుకాకపోవడంతో సమావేశాన్ని సీనియర్లు ముగించారు. తమది అసమ్మతి సమావేశం కాదని కాంగ్రెస్ సీనియర్ల ప్రకటించారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లుగా తీర్మానం చేశామని చెబుతున్నారు.

Updated Date - 2022-03-20T22:15:07+05:30 IST