కాంగ్రెస్కు గెలుపోటములు కొత్తకాదు: శైలజానాథ్
ABN , First Publish Date - 2022-03-14T02:17:58+05:30 IST
కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు కొత్తకాదని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
రాజమహేంద్రవరం: కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు కొత్తకాదని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎంఐఎం వంటి పార్టీలు బీజీపీతో మిలాఖత్ కావడం వల్లనే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ప్రతి ఇంటికి ఏదొక లబ్ధి చేకూరిందని చెప్పారు. ప్రస్తుతం పార్టీ ఓటమి చెందిందని, అధికారంలో లేదని, ప్రజల నుంచి ఆదరణ కరువైందని నిరుత్సాహం పడవద్దని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి రాహుల్గాంధీని ప్రధానిగా చేయాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు.