టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నకౌలాస్ లేఖ
ABN , First Publish Date - 2022-07-27T22:35:57+05:30 IST
కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నకౌలాస్ లేఖ రాశారు. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్రెడ్డిని తొలగించాలని లేఖలో పేర్కొన్నారు.
నల్గొండ: కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నకౌలాస్ లేఖ రాశారు. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్రెడ్డిని తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీతో చేతులు కలపడం ఎంతవరకు సమంజసమన్నారు. టికెట్ ఎవరికిచ్చినా 50వేల మెజార్టీతో పార్టీని గెలిపిస్తామన్నారు. వారంలో మునుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర నేతలతో నియోజకవర్గ పార్టీ శ్రేణులకు, ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు.