నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం... అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్

ABN , First Publish Date - 2021-03-06T18:31:00+05:30 IST

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శనివారం జరగనుంది. అసోం, బెంగాల్ అభ్యర్థుల జాబితాకు తుదిరూపు ఇవ్వడానికి ఈ

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం... అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శనివారం జరగనుంది. అసోం, బెంగాల్ అభ్యర్థుల జాబితాకు తుదిరూపు ఇవ్వడానికి ఈ భేటీ జరుగుతుంది. అయితే మొదటి రెండు దశలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీకి పార్టీ సీనియర్లతో పాటు బెంగాల్, అసోం ముఖ్య నేతలు పాల్గొంటారు. బెంగాల్ లో ఇప్పటికే వామపక్షాలతో పాటు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో కాంగ్రెస్ జత కట్టింది. 92 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అయితే అభ్యర్థులను మాత్రం కాంగ్రెస్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ భేటీలోనే ఖరారు చేసి, వెల్లడించే అవకాశాలున్నాయని నేతలు తెలిపారు. 


Updated Date - 2021-03-06T18:31:00+05:30 IST