మీటర్లు బిగించాలన్న ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరం: Tulasi reddy

ABN , First Publish Date - 2022-05-13T17:20:52+05:30 IST

వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

మీటర్లు బిగించాలన్న ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరం: Tulasi reddy

అమరావతి: వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం దురదృష్టకరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి(Tulasi reddy) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఇది రైతు వ్యతిరేక నిర్ణయమన్నారు. పంపు సెట్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరి తాళ్లు బిగించడం ఒకటే అని వ్యాఖ్యానించారు. ఇది ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే పన్నాగమని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని తెలిపారు. మీటర్లు బిగిస్తే రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయన్నారు. మీటర్లు బిగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 

Read more