వాడివేడిగా సీడబ్ల్యూసీ సమావేశం

ABN , First Publish Date - 2022-03-13T23:01:06+05:30 IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది.

వాడివేడిగా సీడబ్ల్యూసీ సమావేశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు పార్టీ నాయకత్వం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అతి దారుణమైన ఫలితాలు రావడంతో సమావేశం వాడివేడిగా సాగుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లో ఎదురైన ఘోర పరాభవంపై కూడా చర్చిస్తున్నారు. గులాం నబీ ఆజాద్ నివాసంలో నిన్న అసమ్మతి నేతలు సమావేశమై చర్చించిన విషయాలపై కూడా చర్చకు వస్తోంది. ముకుల్ వాస్నిక్‌ను పార్టీ ప్రెసిడెంట్ గా చేయాలని అసమ్మతి నేతల జీ 23 గ్రూప్ డిమాండ్ చేస్తోంది. పార్టీ సీనియర్ నేతలు గులం నబీ ఆజాద్, చిదంబరం, మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా తదితరులు సమావేశానికి హాజరయ్యారు.  




మరోవైపు ఏఐసీసీ కార్యాలయం బయట కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా, రాహుల్ రాజీనామాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. 

Updated Date - 2022-03-13T23:01:06+05:30 IST