Congress రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్

ABN , First Publish Date - 2022-05-21T17:14:44+05:30 IST

జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మోగిలిపాలెం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Congress రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్

కరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మోగిలిపాలెం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు  అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2022-05-21T17:14:44+05:30 IST