చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి
ABN , First Publish Date - 2021-03-09T06:54:24+05:30 IST
ఏ కారణ మో తెలియదు కాని పురుగు మందు తాగిన కాని స్టేబుల్ ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమ వారం మృతి చెందాడు.
ఏలూరు క్రైం/వేలేరుపాడు, మార్చి 8 : ఏ కారణ మో తెలియదు కాని పురుగు మందు తాగిన కాని స్టేబుల్ ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమ వారం మృతి చెందాడు. పెనుగొండ మండలం సిద్ధాంతానికి చెందిన కె.నాగేంద్ర కుమార్ కానిస్టేబు ల్గా పోలీస్ శాఖలో చేరారు. ప్రస్తుతం వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఈనెల 2న వేలేరుపాడు లో పురుగుమందు తాగాడు. ముందుగా జంగారెడ్డి గూడెం ఆసుపత్రికి, పరిస్థితి విషమించడంతో ఈనెల 4న ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎమ్మెల్సీగా కేసు నమోదు చేసి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధు వులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ మృతి విషయం తెలుసు కున్న వేలేరుపాడు ఎస్ఐ రమేశ్ ఆశ్రం ఆసుపత్రికి వెళ్లారు. పోలీసు సిబ్బంది దిగ్భాంతికిగురయ్యారు.