ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ABN , First Publish Date - 2020-11-27T05:42:26+05:30 IST

తూర్పు నౌకాదళంలో 71వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
రాజ్యాంగ ప్రతిజ్ఞ చేస్తున్న పోర్టు చైర్మన్‌ రామమోహన్‌రావు తదితరులు

విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తూర్పు నౌకాదళంలో 71వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు, నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో సిబ్బంది రాజ్యాంగ ప్రవేశికను చదివి, ప్రాథమిక హక్కుల గురించి ప్రసంగించారు. 


ఈపీడీసీఎల్‌లో..

ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రాజబాపయ్య, బి.రమేశ్‌ప్రసాద్‌, సీజీఎంలు పాల్గొన్నారు.


విశాఖపట్నం పోర్టులో.. 

విశాఖపట్నం పోర్టులో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీడియో సమావేశం ద్వారా రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో పోర్టు చైర్మన్‌ రామమోహన్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T05:42:26+05:30 IST